హైదరాబాద్ : ఒక జాతిగా నర్సులకు తామెంత రుణపడి ఉన్నామో చెప్పలేమన్న ఉపాసన కొణిదెల వారి సేవలను కొనియాడారు. బుధవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బిజినెస్ ఉమెన్, నటుడు రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదల ట్విట్టర్ ద్వారా స్పందించారు. కొన్ని నెలలక్రితం ఈ దేవదూతలతో గడిపే ఆనందమయమైన క్షణాలు కొన్ని నాకు లభించాయి. కరోనా మహమ్మారిపై పోరులో ఫిబ్రవరి 2021 వరకు కొవిడ్-19తో 116 మంది నర్సులు ప్రాణాలను కోల్పోయారు. ఒక దేశంగా మేము మీకెంత రుణపడి ఉన్నామో చెప్పలేం. మీకివే నా నమః సుమాంజలి అని ఉపాసన పేర్కొన్నారు.