హవేళిఘనపూర్, ఏప్రిల్ 1: గ్రామ పంచాయతీ డెవలప్మంట్ కమిటీ ద్వారా రాబోయే సంవత్సరంలో అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల కోసం ప్రణాళికలు తయారు చేసుకొని మండల కమిటీకి అప్పగించాలని మండల ప్రత్యేక అధికారి నగేశ్ అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో మండల డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ నగేశ్ మాట్లాడుతూగ్రామ స్థాయిలో ఏయే పనులకు ఎంత నిధులు అవసరం, జాబితాను తయారు చేసి వాటిని జిల్లా కమిటీకి పంపిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం నిధులు కేటాయించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం ఎంపీపీ శేరి నారాయణరెడ్డి మాట్లాడుతూ మండల డెవలప్మెంట్ కమిటీ ద్వారా ఎన్నో ఉపయోగాలుంటాయని, వీటిని వినియోగించుకుంటే రాబో యే రోజుల్లో అభివృద్ధి పనులకు సులువుగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ రాధాకిషన్యాదవ్, ఎంపీడీవో శ్రీరామ్, ఎంపీవో ప్రవీణ్, మండల కో- అప్షన్ సభ్యులు ఖాలేద్, గ్రామసర్పంచ్లు రాజేందర్రెడ్డి, సవిత, శ్రీహరి, దేవాగౌడ్తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తాగునీటికి ప్రాధాన్యత కల్పించాలి:మండల ప్రత్యేకాధికారి, డీఎఫ్వో జ్ఞానేశ్వర్
గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్య సమస్యలు పరిష్కరించేలా నిధుల కేటాయింపులకు ప్రాధాన్యత కల్పించాలని మండల ప్రత్యేకాధికారి, జిల్లా ఇన్చార్జి డీఎఫ్వో జ్ఞానేశ్వర్ అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బ్లాక్ పంచాయతీ డెవలెప్మెంట్ ప్లాన్ 2021-22 కింద ఎంపీటీసీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 15వ ఆర్థిక సం ఘం మంజూరైన నిధులతో 50 శాతం గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం కోసం అవసరమైన పనులను చేపట్టాలన్నారు. మిగతా 50 శాతం నిధులు పాఠశాలల్లో మరమ్మతులు, నీటి సరఫరా వంటి అవసరాలను వినియోగించాలన్నారు. ఆరెపల్లి గ్రామంలో పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం పనులను పరిశీలించారు. సమావేశంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి అంబర్సింగ్, ఎంపీపీ శ్రీనివాస్, ఎంపీడీవో రాంనారాయణ, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, మండల రైతుబంధు అధ్యక్షుడు సురేశ్గౌడ్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ..
కేరళలో యూడీఎఫ్ అభ్యర్థికి కరోనా పాజిటివ్
దేశంలో కరోనా పంజా.. ఒకే రోజు 72 వేల కేసులు, 459 మంది మృతి