మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని
లబ్ధిదారులకు షాదీముబారక్ చెక్కులు పంపిణీ
ఆదిలాబాద్ రూరల్, మార్చి 31: బడుగు బలహీన వర్గాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కైలాస్నగర్లో బుధవారం 11మంది లబ్ధిదారులకు షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రకాశ్, లక్ష్మణ్, సాయి, పండ్ల శ్రీనివాస్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ సూచించారు. మండలంలోని దంతన్పెల్లి, శ్యాంపూర్, సాలేవాడ, నర్సాపూర్, నాగాపూర్ గ్రామాల్లో ఆమె పర్యటించారు. 110 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. గత సంవత్సరం యాంద గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త సాజిద్ఖాన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పార్టీ సభ్యత్వం ఉన్నందున రూ.2 లక్షల బీమా చెక్కును అతని కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్రావు, వైస్ఎంపీపీ బాలాజీ, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు రషీద్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అజీమొద్దీన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భరత్, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్, నాయకులు దాసండ్ల ప్రభాకర్, కామెరి పోశన్న, కాటం రమేశ్, రాజ్కుమార్, సర్పంచ్ భూమన్న, ఎంపీటీసీ శారద, తదితరులు పాల్గొన్నారు.