హైదరాబాద్: నగరంలోని మాదాపూర్లో 15 ఏండ్ల బాలిక కనిపించకుండా పోయింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రనాయక్ తండాకు చెందిన సింధు అనే 15 ఏళ్ల బాలిక మూడు రోజుల క్రితం అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను దుండగులు కిడ్నాప్ చేశారని అందులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.