హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : నగరంలో ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అత్యంత వైభవంగా నిర్వహించేందుకు వీలుగా ఆలయాల్లో అవసరమైన ఏర్పాట్ల కోసం ప్రభుత్వం 2023-24 బడ్జెట్ నిధుల నుంచి వీటిని మంజూరు చేసింది. ఉత్సవాలు నిర్వహించే ఆలయాల్లో వీటిని ఖర్చు చేసేందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు డ్రా చేసే అధికారం కల్పించారు.