వైరస్ వేగంగా విస్తరిస్తున్నది.. జాగ్రత్తగా ఉండాలి
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్
చిక్కడపల్లి, జనవరి 14 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి కృషి చేస్తున్నాయని, ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ముషీరాబాద్లో రూ.52లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ పావనీవినయ్కుమార్తో కలిసి శంకుస్థాపన చేశారు. గాంధీనగర్ డివిజన్ పరిధిలోని వై జంక్షన్ నుంచి ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ వరకు రూ.32లక్షలతో, నర్మద హాస్పిటల్ వద్ద రూ.10.50లక్షలతో వీడీసీసీ రోడ్డు పనులకు, రూ.10 లక్షలతో అశోక్నగర్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నదని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మరిన్ని నిధులు తీసుకువస్తానని చెప్పారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. డివిజన్ల వారీగా అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధికప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలన్నారు. ప్రభుత్వం, వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, జీహెచ్ఎంసీ డీఈ సన్నీ, వర్క్ ఇన్స్పెక్టర్ రఘురాం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోతుల శ్రీకాంత్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, మారిశెట్టి నర్సింగ్ రావు, గడ్డమీది శ్రీనివాస్, సుధాకర్, రవి శంకర్ గుప్తా, జి.వెంకటేశ్, ముఠా రామ్రాజ్, సీహెచ్.నవీన్. హన్మంతు, ఎస్టీ ప్రేమ్, ఎంబీ కృష్ణ, పాశం రవి, జీవై గిరి, తుడం లక్ష్మి, సుధా, రాజ్కుమార్, సురేశ్, యాసీన్, బీజేపీ నాయకుడు వినయ్కుమార్, డివిజన్ అధ్యక్షుడు రత్నసాయిచంద్, రామేశ్ రామ్, జయేందర్ బాబు, సీకే శంకర్, తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి, గోపాల్, ఆకుల సురేందర్, పాల శ్రీను, ఆనంద్ రావు, అరుణ్ కుమార్, అభిషేక్, అరుణ, తులసి, తదితరులు పాల్గొన్నారు.