కార్వాన్, జనవరి 14: మకర సంక్రాంతిని పురస్కరించుకుని కార్వాన్ రజక సంఘం ఆధ్వర్యంలో గిర్కపల్లిలోని గిర్క మైసమ్మ, ఈదమ్మలకు శుక్రవారం ఘనంగా ఉమ్మ డి బోనాలు సమర్పించారు. ఈ ఏడాది 185వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవార్లకు బోనాల పండుగ నిర్వహించారు. రజక సంఘం ఆధ్వర్యంలో వేదికను ఏర్పాటు చేసి అతిథులను సన్మానించారు. ఈ సందర్భంగా రజక సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ కార్వాన్లో రజక కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగించే తమ కుల పెద్దలు మూసీ తీరంలో బట్టలు ఉతకడం వల్ల ఇక్కడ నెలకొని ఉన్న ఈదమ్మకు పూజలు నిర్వహించడం అనాదిగా తమ ఆచారంగా వచ్చిందన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాదితో 185వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కార్వాన్ టీఆర్ఎస్ ఇన్చార్జి ఠాకూర్ జీవన్ సింగ్, ఎంఐఎం నాయకుడు జి.వేణు గోపాల్ యాదవ్, కామ్రేడ్ కుమార్ పాల్గొన్నారు. కార్వాన్ రజక సంఘం వ్యవస్థాప క చైర్మన్ సి.బాబు, సంఘం కార్వాన్ అధ్యక్షుడు సి.అశోక్ పహిల్వాన్, ప్రధాన కార్యదర్శి సి.ప్రేమ్, గోపాల్, శంకర్, సత్యనారాయణ, జ్ఞానేశ్వర్, , నర్సింగ్రావు పాల్గొన్నారు.