శేరిలింగంపల్లి, జనవరి 14: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వెస్ట్జోన్ కమిషనర్ ప్రియాంక ఆల ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య విభాగం సిబ్బంది రంగోలి ముగ్గులు వేశారు. గచ్చిబౌలి, ఇందిరానగర్, ప్రేమ్నగర్, మాదాపూర్ ప్రాంతాలోని పలు బహిరంగ ప్రదేశాల్లో రంగురంగుల ముగ్గలను వేసి ఆకట్టుకున్నారు. చెత్తడంపింగ్ ప్రాంతాల్లో పరిసరాలను ప్రత్యేకంగా శుభ్రపరిచి రంగోలి ముగ్గలు వేశారు. శేరిలింగంపల్లి పారిశుధ్య విభాగం సూపర్వైజర్ జలంధర్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పీలు కృష్ణ, కిరణ్, కిష్టప్పలతో పాటు పలువురు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
గుల్మోహర్ పార్క్ కాలనీలో..
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్మోహర్ పార్క్ కాలనీలో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కాలనీవాసులకు సీనియర్, జూనియర్ విభాగాల్లో శుక్రవారం సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. కాలనీవాసులు ఎంతో ఉత్సాహంతో ఈ పోటీల్లో పాల్గొని అందమైన రంగవళ్లికలు వేసి ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో విజేతలకు కాలనీసంక్షేమ సంఘం అధ్యక్షుడు షేక్ ఖాసీం బహుమతులు అందజేశారు. సీనియర్ విభాగంలో ప్రవళ్లిక, స్వాతి, బీ.సువర్ణ, జూనియర్ విభాగంలో జీ.భవానీ, శ్రీలక్ష్మి, అక్షరలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజేతలుగా నిలిచారు.