నేరేడ్మెట్/ మల్కాజిగిరి/ గౌతంనగర్, జనవరి 14: ధనుర్మాసోత్సవాల్లో భాగంగా భోగి రోజున శుక్రవారం శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 9గంటల నుంచే ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ఆనంద్బాగ్ చౌరస్తాలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయం, నేరేడ్మెట్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు గోదాదేవి కల్యాణం సాంప్రదాయబద్ధంగా నిర్వహంచారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి కల్యాణఘట్టాన్ని తిలకించారు. ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది. అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వాహణాధికారి ఏబీ రవీంద్రారెడ్డి, క్లర్క్ సండ్ర సుధాకర్ చెప్పారు.
మల్కాజిగిరి : అల్వాల్లోని బాలాజీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులకు ప్రసాదం అందజేశారు. కానాజీగూడలోని మరకత శ్రీలక్ష్మీగణపతి దేవాలయంలో సత్యనారాణ శాస్త్రి పూజ లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాజగోపాల్ సయించార్, ఈఓ నరేందర్, అర్చకులు రఘు పంతులు, శ్రీను పంతులు, వెంకటరాంరెడ్డి, సురేందర్రెడ్డి, రాజనరసింహారెడ్డి, శివరామకృష్ణ, రాము, ఆరన్ జ్యోతి, నరహరి పాల్గొన్నారు.
గౌతంనగర్, జనవరి14 : డివిజన్ పరిధి జేఎల్ఎన్ఎస్ నగర్లోని శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఘనంగా శ్రీ గోదాదేవి కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి, మల్కాజిగిరి నియోజకవర్గం టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు సాదు పరమేశ్, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.