కరోనా కష్టాలు తొలగిపోవాలి
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఆకట్టుకున్న రంగవల్లులు
కందుకూరు, జనవరి 14 : కందుకూరు, జనవరి 14 : సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లెల్లో సందడి నెలకొంది. పట్నం నుంచి బంధువులు పల్లెటూర్లకు తరలి రావటంతో గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. ప్రతి ఇంటా పిల్లా పాపలతో, అల్లరి చేష్టలతో కళకళలూడుతున్నాయి.హైదరాబాద్, నగరం నుంచి ప్రజలు తమ సొంత ఊళ్లకు, బంధువుల వద్దకు పండుగకు వచ్చారు. ప్రతి ఇంటా పండుగ వాతావరణం సంతరించుకుంది. ఇళ్లముందు తెల్లవారు జామునే కల్లాపి చల్లి , ఎంతో అందమైన ముగ్గులతో ఆడపడుచులు తమ వాకిళ్లలో అలంకరించుకోగా, మహిళలు పిండి వంటలు తయారీలో నిమగ్నమయ్యారు. సంక్రాంతి పర్వదినం ముందు రోజు భోగి , తెలుగు లోగిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఉదయం లేచింది మొదలు ఆడపడుచులు వాకిళ్లలో రంగురంగుల రంగవల్లులను వేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి గంగిరెద్దు ముందు మొక్కి పూజలు ప్రారంభించారు. కాలంలో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. కరోనా లాంటి కష్టాలు తొలగిపోవాలని కోరకున్నారు. నియోజకవర్గ ప్రజలకు మంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.