ఉప్పల్/ మల్లాపూర్, జనవరి 14 : సంక్రాంతి పర్వ దినాన్ని పురస్కరించుకొని మల్లాపూర్ డివిజన్ జీహెచ్ఎంసీ మైదానంలో స్థానిక యువకులు, చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి, నాచారం సీఐ కిరణ్కుమార్లు పతంగులను ఎగురవేసి తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పల్లా కిరణ్కుమార్రెడ్డి, వాసుదేవ్గౌడ్, మహేందర్ పాల్గొన్నారు.
మల్లాపూర్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కార్పొరేటర్ బొంతు శ్రీదేవియాదవ్ శుక్రవారం చర్లపల్లి డివిజన్లో చిన్నారులతో కలిసి పతంగులను ఎగురవేశారు.
కాలనీవాసుల బోగి మంటలు..
ఉప్పల్ : హబ్సిగూడ స్ట్రీట్ నెం 8లోని నవదోయకాలనీవాసులు శుక్రవారం బోగి మంటలు వేశారు. కుటుంబసమేతంగా హాజరైన కాలనీవాసులు బొగి మంటలతో సంబురాలు ప్రారంభించారు. అనంతరం రంగవల్లుల ముగ్గులతో, గొబ్బెమ్మలతో సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు శాంతికుమార్ నోము ల, నరేందర్, రామక్రిష్ణ, ప్రణవ్, చారి, తదితరులు పాల్గొన్నారు.