పండుగ వేళ జాగ్రత్త అవశ్యం
నిర్లక్ష్యానికి తప్పదు మూల్యం
షాపింగ్, ప్రయాణాల్లో పదిలం
గుంపుల్లో ఉండకపోవడమే మేలు
నేడు భోగి పర్వదినం
సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తేతెలంగాణ);సంక్రాంతి వచ్చిందంటే ఇంటింటా సంబురమే. చాలామంది సొంతూళ్లకు పయనమవుతుండగా, నగరంలో ఉన్నవారు సంబురాల్లో మునిగిపోయారు. కొత్త బట్టలు, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు దుకాణాల బాట పట్టారు. ఇదే సమయంలో కరోనా కోరలు చాస్తుండడంతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డెల్టా వేరియెంట్తో పోల్చితే ఒమిక్రాన్ వైరస్ ఆరు రెట్లు వేగంగా వ్యాపిస్తుండడంతో గుంపులు, జనసమ్మర్థ ప్రదేశాల్లో తిరగొద్దని హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకెళ్లాలని, వెళ్లినా మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నారు. టీకా వేసుకున్నామని జాగ్రత్తలను విస్మరించొద్దంటున్నారు.