ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వస్తే..ప్రొటోకాల్ పాటించలేదంటారా.?
అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదు
అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారు
ఎమ్మెల్యేపై విమర్శలా.. అడిక్మెట్ కార్పొరేటర్ తీరుపై మండిపడ్డ టీఆర్ఎస్ నేతలు
ముషీరాబాద్, జనవరి 13: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే బస్తీల్లో పర్యటిస్తే ప్రొటోకాల్ పాటించడం లేదంటూ అడిక్మెట్ కార్పొరేటర్ సునీతాగౌడ్ గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉన్నదని టీఆర్ఎస్ పార్టీ అడిక్మెట్ డివిజన్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.సురేందర్ అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే ముఠా గోపాల్పై విమర్శలు చేసే ముందు ప్రొటోకాల్ విధి విధానాలను తెలుసుకోవాలని సూచించారు. గురువారం సత్యానగర్ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రెండుసార్లు కార్పొరేటర్గా ఎన్నికైన సునీతా గౌడ్ కనీస అవగాహన లేకుండా ప్రొటోకాల్ పేరుతో రాజకీయం చేయడం శోచనీయమన్నారు. తనకంటూ ప్రత్యేక బడ్జెట్ లేని కార్పొరేటర్ తాను అంజయ్యనగర్లో పైపులైన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల సమయంలో మాత్రమే ప్రొటోకాల్ వర్థిస్తుందనే విషయాన్ని కార్పొరేటర్ గుర్తుపెట్టుకోవాలని హితవుపలికారు. ఎమ్మెల్యే బస్తీలలో పర్యటించిన ప్రతిసారి కార్పొరేటర్లను పిలువడం కుదరదని స్పష్టం చేశారు. స్థానిక ఎంపీగా, కేంద్ర మంత్రిగా కిషన్రెడ్డి ముషీరాబాద్కు, అడిక్మెట్ డివిజన్కు ఎన్ని నిధులు కేటాయించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అడిక్మెట్ డివిజన్ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆహర్నిషలు కృషి చేస్తుంటే రూపాయి బడ్జెట్ లేని కార్పొరేటర్ సునీతా గౌడ్ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. సాయిచరణ్ కాలనీలో డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపును రాజకీయం చేయడం శోచనీయమని, 60 ఏండ్లకు పైబడిన, అనారోగ్య సమస్యలున్న వారికి ఇండ్లు కేటాయిస్తే కార్పొరేటర్ తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్రెడ్డి, భిక్షపతి, రవియాదవ్, ఖదీర్, ఎ.శ్రీనివాస్, ప్రేమలతారెడ్డి, అనురాధ, భాగ్యలక్ష్మి, మాధవి, గురుదీప్, అబ్బు, నాగేశ్, యూనిస్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాలు మాని నిధులు తీసుకురావాలి..
కార్పొరేటర్ సునీతా గౌడ్ పనికిమాలిన రాజకీయాలు మాని చేతనైతే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ద్వారా డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకురావాలని టీఆర్ఎస్ నాయకులు నేత శ్రీనివాస్, శ్యాంసుందర్, మాధవ్, సయ్యద్ అస్లాం డిమాండ్ చేశారు. గురువారం రాంనగర్ ఈ- సేవ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కోట్లాది రూపాయల జనరల్ ఫండ్ను తమ పార్టీ ఎమ్మెల్యే మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేయిస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో టక్కర్ శ్రీను, రాజు, అహ్మద్, నానిరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.