మియాపూర్, జనవరి 13: కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ మమత సమక్షంలో ఆల్విన్ కాలనీ, హైదర్నగర్, వివేకనందనగర్, కూకట్పల్లి డివిజన్ల పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులతో పాటు పెండింగ్ పనుల స్థితిగతులపై ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ ఆయా డివిజన్ల కార్పొరేటర్లు రోజాదేవి రంగారావు, దొడ్ల వెంకటేశ్ గౌడ్, నార్నె శ్రీనివాస్రావు, కాంట్రాక్టర్లు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి సమీక్షా సమావేవాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి అభివృద్ధికి అధికారులు, కాంట్రాక్టర్లు సహరించాలని కోరారు. వ్యాపార కోణంలో కాకుండా సామాజిక దృక్పథంతో ఆలోచించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించి మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని పనిచేసే వారికి పనులను అప్పగించాలని కోరారు. ఆయా డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి పర్యటించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎస్టీపీ ప్లాంట్లను మంజూరు చేయాలని, మిషన్ కాకతీయ చెరువుల సుదరీకరణ, హైదర్నగర్ డివిజిన్లో మోర్ సూపర్ మార్కెట్ సమస్య పరిష్కారం చేయాలని, ఉష ముళ్లపూడి కమాన్ రోడ్డు విస్తరణ చేపట్టాలని, హెచ్ఎంటీ హిల్స్ రోడ్డు సమస్యను పరిష్కరించేలాచూడాలని, కొత్త రోడ్ల ప్రతిపాదనలు, లింకురోడ్ల ప్రతిపాదనలు, మురుగు నీటి వ్యవస్థ, వైకుంఠ ధామాల అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ డెవలప్మెంట్, సమీకృత వ్యాపార కేంద్రాల ఏర్పాటుతో పాటు కమ్యూనిటీహాళ్ల నిర్మాణం కోసం స్థలం సేకరణ, నాలాల విస్తరణ వాటి అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులు, కార్పొరేటర్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి తాసీల్దార్ గోవర్ధన్, కూకట్పల్లి ఉపకమిషనర్ రవీందర్, జీహెచ్ఎంసీ ఎస్ఈ చిన్నారెడ్డి, డీఈ సత్యనారాయణ, ఏఈ సుభాష్, రాజీవ్, టౌన్ప్లానింగ్ జోన్ ఏసీపీ రఘునందన్, ఇరిగేషన్ ఏఈ విశ్వం పాల్గొన్నారు.