అధిక సంఖ్యలో హాజరై పూజలు చేసిన భక్తులు
ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు
ఎల్బీనగర్ జోన్ బృందం, జనవరి 13 : ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని లింగోజిగూడ డివిజన్, గ్రీన్ పార్కు కాలనీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్చార్జి మల్రెడ్డి రాంరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు, గ్రీన్పార్కు కాలనీ అధ్యక్షుడు కమలాకర్రెడ్డి, జనరల్ సెక్రటరీ బాల్రెడ్డి, మాజీ అధ్యక్షుడు జగన్రెడ్డి, సుధీర్రెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మన్సూరాబాద్ : వైకుంట ఏకాదశిని పురస్కరించుకుని మన్సూరాబాద్ డివిజన్ పరిధి ఆదిత్యనగర్ కాలనీలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, విజయశ్రీకాలనీలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. గురువారం ఉదయం 4 గంటల నుంచి ఆలయాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్నారు. మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ యవజన విభాగం నాయకుడు జక్కిడి రఘువీర్రెడ్డి, విజయశ్రీకాలనీ ఆలయ కమిటీ చైర్మన్ చీర్క నర్సిరెడ్డి, వైస్ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, కోశాధికారి లోకేశ్గౌడ్, సలహాదారుడు భీమిడి నర్సింహారెడ్డి, సభ్యులు ఏనుగు చంద్రారెడ్డి, నర్సింహా చారి, సురేందర్ గౌడ్, సత్యనారాయణ, కాలనీ అధ్యక్షుడు జొన్నాడ మోహన్రెడ్డి, ఆదిత్యనగర్ కాలనీ దేవాలయ కమిటీ ట్రస్టు చైర్మన్ టి. మోహన్రెడ్డి, చైర్పర్సన్ టి. సంతోషికుమారి, సభ్యులు జీకే గుప్త, నాథమునిరెడ్డి, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
చంపాపేట : చంపాపేట డివిజన్ కర్మన్ఘాట్లోని రామాలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని, భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి దీప్తీ, మాజీ ధర్మకర్తలు బసిగూడెం జంగారెడ్డి, సి.అనిత పాల్గొన్నారు.
వనస్థలిపురం : ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష్మీగణపతి దేవాలయంలో స్వామివారు ఉత్తర ద్వారం దర్శనమిచ్చారు. తెల్లవారు జామున 4గంటల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం గోదా రంగనాయక కల్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ బుద్దోలు అశోక్కుమార్ గౌడ్ తెలిపారు. మిట్టా రామ్మోహన్, కంచి కృష్ణమోహన్, టి. లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.