మన్సూరాబాద్, ఫిబ్రవరి 18: వీరన్నగుట్ట అభివృద్ధికోసం హెచ్ఎండీఏ నుంచి రూ.13 కోట్ల నిధులు సమకూర్చడం జరిగిందని ఎమ్మార్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. శనివారం మహాశివరాత్రిని పురస్కరించుకుని మన్సూరాబాద్ డివిజన్ హయత్నగర్ పరిధి వీరన్నగుట్టలోని శివాలయంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డితో కలిసి ఎమ్మె ల్యే పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో పాటు పరిసర కాలనీల సంక్షేమ సంఘం ప్రతినిధులతో ఆలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించి వీరన్నగుట్ట ఆల య అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసర కాలనీల ప్రజలకు గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఆలయ అభివృద్ధికోసం కృషి చేస్తున్నానని తెలిపారు. ఆలయ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని.. రాబోయే రెండేండ్లలో వీరన్నగుట్టను అభివృద్ధి చేసి గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడం జరుగుతుందని పేర్కొన్నారు. రాజకీయాలు ఉంటే ఎన్నికల సమయం లో చేసుకోవాలే కానీ అభివృద్ధి పనుల్లో కాదని.. కొందరు నాయకులు కావాలని ప్రజల మధ్యన చిచ్చు పెడుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలవడటం అలవర్చుకుని అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, మహిళా విభాగం బీఆర్ఎస్ అధ్యక్షురాలు కొసనం ధనలక్ష్మీ, నాయకులు పోబచోయిన జగదీశ్యాదవ్, టంగుటూరి నాగరాజు, కొసనం వెంకట్రెడ్డి, కేకేఎల్ గౌడ్, చంద్రారెడ్డి, కడమంచి ఆనంద్, నరహరి శెట్టి తదితరులు పాల్గొన్నారు.