వాడకం, అమ్మకం పూర్తిగా నిషేధం
చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి
మేడ్చల్ కలెక్టరేట్, జనవరి 12 : మున్సిపాలిటీని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా బుధవారం నాగారం ము న్సిపల్ పరిధిలోని 16వ వార్డులో ర్యాలీ నిర్వహించి ప్ర జలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్త ఆటోల్లో వేయాలని అన్నారు. అంతేగాక ఇండ్లల్లో కంపోస్ట్ ఎరువును తయారు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలందరూ భాగస్వాములై 2022లో స్వచ్ఛ సర్వేక్షణ్లో నాగారం మొదటి ర్యాంకు సాధించేలా కృషి చే యాని తెలిపారు. మున్సిపాలిటీలో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసు లు, ప్లాస్టిక్ వస్తువులు ఎవరు అమ్మవద్దు, కొన వద్దని తెలిపారు. ప్రజలు బట్ట సంచులను మాత్రమే వస్తువుల కొనుగోలుకు వాడాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్ల వల్ల కలిగే నష్టాలను వృత్తి , కూరగాయల వ్యాపారులకు వివరించారు. మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలోని వాణిజ్య, వ్యాపారస్తులు తడి, పొడి చెత్తను మున్సిపల్ వాహనాలకు అందించాలని అన్నారు. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, వస్తువులను వాడకుండా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లేశ్, కౌన్సిలర్ శ్రీనివాస్, కో-అప్షన్ సభ్యులు, అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.