న్యూఢిల్లీ: నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి జీఎస్టీ ఎగవేసిన కేసులో గుజరాత్కు చెందిన ఓ కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు నిర్వహించింది. గుజరాత్లోని అహ్మదాబాద్, భావ్నగర్, బోతాడ్, గాంధీధామ్తో పాటు ముంబై, బెంగళూరు సహా మొత్తం 25 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ.29 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మహమ్మద్ ఇజాజ్ బోమర్తో పాటు పలువురిని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. మొత్తం రూ.1,102 కోట్లకు సంబంధించి నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి, రూ.122 కోట్లు జీఎస్టీ ఎగవేసినట్టు ఈడీ ఆరోపించింది.