Hyderabad | హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( GHMC ) పరిధిలో దారుణం జరిగింది. సనత్నగర్( Sanathnagar )లోని ఓ మండి( Mandi )లో తిన్న 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం బాధితులంతా కోలుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సనత్నగర్లోని హోటల్ మషా అల్లాహ్( Hotel Masha Allah )లో గురువారం రాత్రి మండి తిన్న వారిలో 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధిత వ్యక్తులకు వైద్యులు( Doctors ) చికిత్స అందించారు. 12 మంది కోలుకున్నారని, వారిని శుక్రవారం డిశ్చార్జి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు( GHMC Officials ) ఆ హోటల్ను పరిశీలించారు. ఫుడ్ శాంపిళ్లను సేకరించి, పరీక్షల నిమిత్తం ప్రివెంటివ్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్కు పంపించారు. అనంతరం హోటల్ను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఖైరతాబాద్ సర్కిల్కు చెందిన హెల్త్ అసిస్టెంట్ ఆఫీసర్ డాక్టర్ పీ భార్గవ నారాయణ మాట్లాడుతూ.. వారం రోజుల్లోనే శాంపిళ్ల ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ఫలితాల నివేదిక రాగానే హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.