మన్సూరాబాద్, డిసెంబర్ 11: వానకాలంలో కాలనీల్లో తలెత్తుతున్న వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ హయత్నగర్ పరిధి బాలాజీనగర్, కేవీఎన్నగర్, ఆదిత్యనగర్, లెక్చరర్స్కాలనీ, పవనగిరికాలనీ ఫేజ్-2, లక్ష్మీభవానీనగర్, వీరన్నగుట్ట కాలనీల్లో శనివారం ఉదయం ఆయా కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించిన ఎమ్మెల్యే అక్కడి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. వానకాలంలో క్రీడా సంస్థ నుంచి వరదతో బాలాజీనగర్ తదితర కాలనీలు ముంపునకు గురవతున్నాయని ఎమ్మెల్యేకు కాలనీవాసులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదనీటి ముంపు సమస్య పరిష్కారానికి త్వరలో ట్రంకులైన్ నిర్మాణం చేపడుతామని తెలిపారు. శివారు కాలనీల్లో ఇప్పటికే 90 శాతం మేర డ్రైనేజీ ట్రంకులైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని.. త్వరలో అంతర్గత డ్రైనేజీ పైపులైన్ పనులను చేపట్టి మురుగునీటి సమస్య లేకుండా చూస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అందిస్తున్న సహకారంతో ఎల్బీనగర్ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. శివారు కాలనీల్లో తాగునీటి, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు లేకుండా ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతూ మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కొసనం ధనలక్ష్మి, నాయకులు టంగుటూరి నాగరాజు, జక్కిడి రఘువీర్ రెడ్డి, పోచబోయిన జగదీశ్యాదవ్, కొసనం వెంకట్రెడ్డి, అత్తాపురం రాంచంద్రారెడ్డి, పారంద నర్సింగ్రావు, ఆనంద్యాదవ్, కంచర్ల రాకేశ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.