టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ;ఉప్పల శ్రీనివాస్ గుప్తా
కవాడిగూడ, జనవరి 11: స్వరాష్ట్ర సాధన తర్వాత వ్యవసాయ రంగం రూపు మార్చి.. రైతును రాజు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు. అన్నదాతల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న పలువురు రైతులు, వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి ఆర్యవైశ్య హాస్టల్ ట్రస్ట్ భవనంలో మంగళవారం నేషనల్ ప్రీమియర్, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప్పల మాట్లాడుతూ రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. సీఎం కేసీఆర్ కృషితోనే రైతులు సంతోషంగా ఉన్నారని వివరించారు. కరోనా సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లను కొన్నది ఒక్క సీఎం కేసీఆర్ అని గుర్తుచేశారు. కార్యక్రమంలో సూర్యకళ గుప్తా, రవిశ్రీ, సురేంద్ర సోన, కాచం కృష్ణమూర్తి, రాణి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి విశ్వేశ్వర్ రావు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు విశ్వజ్యోతి పాల్గొన్నారు.