తెలుగు యూనివర్సిటీ, జనవరి 10: ‘ఒంటరిగా ఎదిగి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన మా బాపు బాల సిధారెడ్డే నా హీరో’ అని తెలంగాణ సాహిత్య అకాడమి పూ ర్వ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యం లో వారం రోజులుగా కొనసాగిన పరిణతవాణి ప్రసంగలహ రి పరంపరలో భాగంగా చివరి రోజు సోమవారం ప్రముఖ కవి నందిని సిధారెడ్డి పాల్గొని తన బాల్యం, విద్యాభ్యాసం, సాహిత్య జీవితం తదితర విషయాలపై లోతైన విశ్లేషణ చేస్తూ హృదయాన్ని ఆవిష్కరించారు. తనలో రచనా ప్రేరణకు కారణమం తన తండ్రి గారేనని ఆయన వెల్లడించారు. వచన కవిత్వంలో అష్టకాల నరసింహ రామ శర్మ ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. మంజీర రచయితల సంఘాన్ని స్థాపించి 1996లో ప్రత్యేక తెలంగాణ కావాలని నవసాహితీ కన్వీనర్గా కొనసాగుతున్న తరుణంలో మొదటిసారిగా తీర్మానం చేశామన్నారు. అనంతరం, పరిష త్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ ‘జీవించినంత కాలం నేర్చుకుంటూనే ఉంటాను’ అని సిధారెడ్డి అనడం ఆయన వినయానికి నిదర్శనమన్నా రు. ప్రసంగాలన్నింటిని పుస్తక రూపంలో సాహితీలోకానికి అందిస్తామని పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య తెలిపారు.