సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : వ్యర్థాల నుంచి తయారయ్యే మరో విద్యుత్ (వేస్ట్ టూ ఎనర్జీ) ప్రాజెక్టు వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. 15 మెగావాట్ల సామర్థ్యంతో దుండిగల్లో ఏర్పాటవుతున్న విద్యుత్ ప్లాంట్ వచ్చే నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకువస్తామని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ సోమవారం వెల్లడించారు. ఆరు కేంద్రాల ద్వారా 101 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రస్తుతం జవహర్నగర్ ఫేజ్-1లో 24 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ చివరి నాటికల్లా 15,400 మెట్రిక్ టన్నుల వ్యర్థాల ద్వారా 101 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. పర్యావరణానికి మేలు చేసేలా మరో మైలురాయికి చేరువ కానుంది. 101 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాకారం చేసే కేంద్రాలకు నిలయంగా మారుతోంది.
జీహెచ్ఎంసీ దాని చుట్టు పకల పట్టణ ప్రాంతాలకు చెందిన చెత్తను జవహర్నగర్ డంప్ యార్డుకు తరలించే ప్రక్రియను సమగ్ర మున్సిపల్ ఘన పదార్థాల నిర్వహణ ప్రాజెక్టుగా పరిగణిస్తారు. ఇందులో భాగంగానే జవహర్నగర్ ప్లాంట్ -1 ద్వారా ఇప్పటికే 24 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను సెకండరీ కలెక్షన్, ట్రాన్స్ఫర్ పాయింట్స్ (ఎస్సీటీపీ) నుంచి వ్యర్థాలను జవహర్నగర్ డంప్ యార్డుకు తరలిస్తారు. తరలించిన వెంటనే అకడ యాంత్రికంగా సెగ్రిగేట్ చేసిన తర్వాత మండే గుణం గల వ్యర్థాలను వేరు చేసి విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు.