సిటీబ్యూరో: ఇందిరాపార్క్లో కరాటే, స్కేటింగ్ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ ఏజెన్సీ నిర్వాహకంపై స్థానికులు, వాకర్ల ఫిర్యాదుతో ‘హైడ్రా’ ఆక్రమణలకు కు బ్రేక్ వేసినా.. సదరు నిర్వాహకుడు మాత్రం వెనకి తగ్గడం లేదు. గతంలో సేటింగ్ రింగ్గా ఉన్న దాదాపు ఎకరం స్థలం కొంతకాలంగా నిరుపయోగంగా ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న సదరు వ్యక్తి క్రీడాకారులకు ఉచిత శిక్షణ ఇస్తానంటూ జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ వింగ్ అధికారులను బురిడీ కొట్టించారు.
దీంతో స్పోర్ట్స్ వింగ్ అధికారులు ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండానే ఆ స్థలాన్ని సదరు వ్యక్తికి అప్పగించారు. దీంతో అకడ కరాటే శిక్షణ పేరుతో షెడ్లు వేసి, శాశ్వత నిర్మాణాలకు మెటీరియల్ సిద్ధం చేశారు. స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో ఆక్రమణలను నేలమట్టం చేశారు. ఆ స్థలాన్ని అర్బన్ బయోడైవర్సిటీ వింగ్కు అప్పగించాలని హైడ్రా ఆదేశించింది. అయితే ఆ స్థలం ఇంకా యూబీడీ వింగ్కు పూర్తి స్థాయిలో చేరలేదు. జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ వింగ్లో ఓ అధికారి సదరు ప్రైవేట్ వ్యక్తికి ‘గాడ్ ఫాదర్’గా మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా, ఇందిరా పార్క్ బచావో పేరిట ఆదివారం ఇందిరాపార్క్ వాకర్స్ ప్రొటెక్షన్ కమిటీ ధర్నాకు పిలుపునిచ్చింది.