హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్లో రూ. 26.28 లక్షల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 183 గ్రాముల కొకైన్, 44 ఎండీ ఎక్స్టాసీ మాత్రలను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మాదక ద్రవ్యాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.