కందుకూరు, ఫిబ్రవరి 24 : గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని కొత్తగూడ సర్పంచ్ సాధ మల్లారెడ్డి గురువారం మంత్రిని కలిసి గ్రామంతో పాటు క్రాస్ రోడ్డులోని సీతారామ శాస్త్రీ నగర్లోని సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులకు నిధులు మంజూరు చేయాల్సిందిగా వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగూడ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, సర్పంచ్ సాధ మల్లారెడ్డి, వార్డు మెంబరు మర్రి శేఖర్రెడ్డి, కో ఆప్చన్ మెంబరు బాల్రెడ్డి, నాయకులు తాల్ల బాలేశ్ముదిరాజ్, బండారు క్రిష్ణ, క్రిష్ణాగౌడ్ పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన కుల సంఘాల నాయకులు..
మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలం కేటాయించాలని వివిధ కులాల సంఘం నాయకులు మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మంత్రి సానుకూలంగా స్పందిం చి అన్ని కూలాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఆనేగౌని దామోదర్గౌడ్, పాండుగౌడ్, సౌడపు శేఖర్గౌడ్, వెంకటేశ్గౌడ్. సిద్ధేశ్వర్గౌడ్, మక్తాల వెంకటేశ్గౌడ్, రాజుగౌడ్, తిరుపతిగౌడ్, రూప్ చందర్ పాల్గొన్నారు.
m