కవాడిగూడ, ఏప్రిల్ 19: కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం కవాడిగూడలోని దోమలగూడ పూల్బాగ్ మొదటి వెంచర్లో ఆయన ఇంటింటికీ తిరిగి కరోనా పట్ల అవగాహన కల్పించారు. నియోజక వర్గంలోని అన్ని డివిజన్లలో శానిటైజేషన్ చేయాలని జీహెచ్ఎంసీ సర్కిల్-15 వైద్యాధికారి హేమలతకు సూచించారు. అనంతరం గగన్మహల్లోని యూపీహెచ్సీ కేంద్రాన్ని సందర్శించి కరోనా వ్యాక్సిన్ గురించి అడిగి తెలుసుకున్నారు. టీకా కోసం వచ్చినవారు మా స్కులు ధరించాలని సూచించారు. కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా కరోనా పరీక్షలు వేగవంతం చేయాలని అన్నారు.
ఈ సందర్భంగా దోమలగూడలోని మీ సేవా కేంద్రం ముందున్న జీహెచ్ఎంసీ పార్కును సందర్శించి అక్కడి సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అక్కడ వెలిసిన గుడిసెలు, కాంక్రీట్ మిక్సర్ను చూసిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడారు. పార్కులో గుడిసెలు వేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా మారుతీనగర్ను సందర్శించి ఉస్సేన్సాగర్ వరద కాలువలో పేరుకుపోయిన చెత్తా, చెదారం, రాళ్లను తొలగించాలని స్టాటిజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం డిప్యూటీ ఈఈ పేర్రాజుకు సూచించారు. జీహెచ్ఎంసీ అధికారులు పనులు మొదలు పెట్టారని ఎమ్మెల్యేకు వివరించారు. వచ్చే వర్షాకాలంలో ఎలాంటి సమస్యలు తల్తెకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. అదే విధంగా డీబీఆర్ మిల్స్ దావాఖానలో మాస్కులు లేకుండా కోవిడ్ టీకాను వేస్తున్న వైద్య సిబ్బందిపై ఎమ్మెల్యే అగ్రహం వ్యక్తం చేశారు. భౌతిక దూరం పాటించాలన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఎస్. యాదగిరి, రాజశేఖర్, రాంచందర్, రవి, శివ, రాజేశ్, పూల్బాగ్ వాసులు సిరిస్వామి, జితేందర్రెడ్డి, ఉదయ్, దక్షాశాస్త్రీ, బీజేపీ నాయకులు పరిమల్కుమార్ పాల్గొన్నారు.