సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ‘నిధి ఆప్కే నికట్ 2.0’ పేరుతో ఈపీఎఫ్ఓ హైదరాబాద్ జిల్లా ప్రాంతీయ కార్యాలయం-మాదాపూర్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమం విజయవంతమైంది. నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే దినపత్రిక కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు, సిబ్బంది ప్రావిడెంట్ ఫండ్ సేవలు, పెన్షన్, లోన్స్, పాస్బుక్ అప్డేట్స్, ఎస్ఎంఎస్ అంశాల్లో సందేహాలను నివృత్తిచేశారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ మేనేజర్ మధు, ఈపీఎఫ్వో ఎన్ఫోర్స్మెంట్ అధికారి టి.శ్రీనివాసరావు, రాజు బియ్యాని, లాలం ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.