హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): కరోనాపై మోనోక్లోనల్ యాంటిబాడీస్ ఇంజెక్షన్ బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యంలో గురువారం హెల్త్ ఫర్ ఆల్ అనే అంశంపై నిర్వహించిన వెబినార్లో నాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే ఇది మనదేశంలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం దీని ధర రూ.70వేల వరకు ఉండగా, ఉత్పత్తి పెరిగిన తర్వాత రూ.10-15 వేలకు తగ్గిపోయే అవకాశముందని ఆయన వివరించారు. డెల్టా వైరస్ చాలా ప్రమాదకరమని, వ్యాక్సిన్ ద్వారా కరోనా వైరస్ నుంచి పూర్తి రక్షణ పొందవచ్చన్నారు.