బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్పుత్ యూట్యూబర్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సుపరిచితురాలు. సోషల్ మీడియా వేదికగా సౌందర్య పోషణకు సంబంధించి రకరకాల చిట్కాలు చెబుతూ ఉంటుంది. ‘అందమైన చర్మం కోసం..’ అంటూ ఇటీవల ఆమె పంచుకున్న టూ ఇన్గ్రీడియంట్ ఫేస్ మాస్క్ (రెండు పదార్థాలతో చేసిన ఫేస్మాస్క్)కు మంచి స్పందన వచ్చింది.
చలికాలంలో చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుకునేందుకు పసుపు, తేనె మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, పది నిమిషాల తర్వాత.. కడిగేసుకుంటానని ఇందులో చెప్పింది. ఈ ఫేస్ప్యాక్లోని తేనె చర్మంలోని తేమను నిలిపి ఉంచుతుంది. పసుపు తేనె.. రెండూ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగినవే. దీంతో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తాయి. మెత్తటి చర్మం కావాలంటే మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి!