మనిషికి శారీరకారోగ్యంతోపాటు మానసికారోగ్యం కూడా ముఖ్యమైనదే. ఒత్తిడి, పనిభారంతో సతమతమయ్యేవారిలో మానసికారోగ్యం లోపిస్తుంది. నిరాశ, భయం, కలత చెందుతున్నప్పుడు మానసికారోగ్యం బాగుండదు. దీంతో వివిధ వ్యాధులు చుట్టుముడతాయి. అందుకే శారీరకారోగ్యంతోపాటు మానసికారోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
పోషకాహార లోపం, మానసికారోగ్యానికి మధ్య పరస్పర సంబంధం ఉంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మానసికారోగ్యం దెబ్బతింటుంది. అధిక స్థాయి ఒత్తిడి, అతిగా మద్యం సేవించడం, వ్యాయామం లేకపోవడం, అధిక కెఫిన్ వినియోగం అనేవి మెంటల్ హెల్త్పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. శరీరంలో కనిపించే ఏ లోపమైనా మెదడుపై ప్రభావం చూపుతుంది. మానసికారోగ్యం కోసం ఈ కింది ఆహార నియమాలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.