న్యూఢిల్లీ : దైనందిన జీవితంలో మనం వాడే ఆహార పదార్ధాలను నిల్వ చేసుకునేందుకు రిఫ్రిజిరేటర్ను వాడుతుంటాం. ముడి ఆహార పదార్ధాల నుంచి వండిన మీల్స్ వరకూ ఫ్రిజ్లో స్టోర్ చేస్తుంటాం. సమయం, శక్తిని ఆదా చేసుకునేందుకు ఫ్రిజ్ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది.
అయితే నిర్ధిష్ట ఆహార పదార్ధాలను ఫ్రిజ్లో నిల్వ చేయడం సరైంది కాదని వాటిని అలా స్టోర్ చేస్తే అవి విష వ్యర్ధాలుగా మారే ప్రమాదం ఉందని మనలో చాలా మందికి తెలియదు. ఈ తరహా ఆహార పదార్ధాలను ఫ్రిజ్లో నిల్వ చేస్తే అవి రసాయన మార్పులకు గురై మన ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయని పోషకాహార నిపుణులు పూజా మల్హోత్రా హెచ్చరిస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో నిల్వ చేస్తే అలాంటి ఆహార పదార్ధాలు అత్యవసర పోషకాలను కోల్పోతాయి.
దాంతో పాటు ఆహారం రంగు, రుచి, టెక్స్చర్ దెబ్బతింటాయని పూజా చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్ధాలను ఫ్రిజ్లో నిల్వ చేస్తే అవి విషపూరిత వ్యర్ధాలుగా మారతాయని డాక్టర్ డింపుల్ జంగ్ధ చెబుతున్నారు. ఫ్రిజ్లో నిల్వ చేయకూడని ఆహార పదార్ధాలను పరిశీలిస్తే..
అల్లం
వెల్లుల్లి
ఉల్లి
బియ్యం
Read More :
Nirmala Sitharaman: 2047 నాటికి వికసిత్ భారత్: మంత్రి నిర్మలా సీతారామన్