Dates And Ghee | ఖర్జూర పండ్లు అంటే చాలా మందికి ఇష్టమే. ఈ పండ్లను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటి తియ్యని రుచి కారణంగా చిన్నారులు కూడా ఈ పండ్లను ఇష్టపడుతుంటారు. ఖర్జూర పండ్లను చాలా మంది స్వీట్ల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఈ పండ్లతో పలు రకాల డ్రింక్స్ను కూడా తయారు చేసి తాగుతుంటారు. అయితే ఖర్జూరాలను రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ పండ్లను రోజూ 3 చొప్పున తీసుకుని నెయ్యిలో ఒక రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే అనేక లాభాలు కలుగుతాయని అంటున్నారు. ఖర్జూరాలను ఈ విధంగా తీసుకోవడం వల్ల పలు వ్యాధులు నయమవడమే కాదు, పోషణ కూడా లభిస్తుందని చెబుతున్నారు.
ఖర్జూరాల్లో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. అలాగే నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందువల్ల ఈ రెండింటిని కలిపి తింటే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. దీంతో యాక్టివ్గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎక్కువ సేపు ఉన్నా అలసట రాదు. ఎంత పని చేసినా అలసిపోకుండా ఉంటారు. నీరసం, నిస్సత్తువ దరి చేరవు. ఉదయం నిద్ర లేవగానే నీరసంగా ఉంటుందని భావించే వారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే రోజంతా యాక్టివ్గా ఉంటారు. చురుగ్గా పనిచేసుకోవచ్చు. ఖర్జూర పండ్లలో ఉండే సహజసిద్ధమైన చక్కెరలు హార్మోన్లను నియంత్రిస్తాయి. అందువల్ల హార్మోన్ సమస్యలు ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు హార్మోన్లు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో హార్మోన్ల సమస్యలు ఉన్నవారు ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. రోగాల నుంచి విముక్తి లభిస్తుంది.
ఖర్జూరాల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. నెయ్యితో కలిపి ఖర్జూరాలను తింటే శరీరం ఐరన్ను అధికంగా శోషించుకుంటుంది. దీంతో రక్తం తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఖర్జూరాలు, నెయ్యి మిశ్రమం మన చర్మానికి అవసరం అయిన పోషకాలను అందిస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు కనబడవు. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు తగ్గిపోతాయి. ఖర్జూరాల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. వీటిని నెయ్యితో కలిపి తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
ఖర్జూరాలలో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఖర్జూరాల్లో ఉండే ఫైబర్ శరీరానికి పోషకాలు అందేలా చూస్తుంది. నెయ్యితో కలిపి వీటిని తినడం వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. పోషకాహార లోపం నుంచి బయట పడవచ్చు. ఖర్జూరాల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. నెయ్యి సహజసిద్ధమైన లాక్సేటివ్ గా పనిచేస్తుంది. దీని వల్ల మలబద్దకం నుంచి బయట పడవచ్చు. నెయ్యి, ఖర్జూరాల మిశ్రమం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఖర్జూరాల్లో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. నెయ్యితో కలిపి ఖర్జూరాలను తింటే బీపీ నియంత్రణలోకి వచ్చి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా ఈ రెండింటి మిశ్రమంతో ఎన్నో లాభాలు కలుగుతాయి.