డల్లాస్ : మానసిక ఒత్తిడి శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులతో పాటు పలు అధ్యయనాలు వెల్లడించాయి. తీవ్ర మానసిక అస్వస్ధత గుండె జబ్బుల ముప్పు పెంచుతుందని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. బైపోలర్ డిజార్డర్, స్కీజోపెర్నియా డిజార్డర్తో బాధపడే 6,00,000 మంది అమెరికన్లపై జరిగిన విశ్లేషణలో పలు వివరాలు వెల్లడయ్యాయి.
ఈ అనారోగ్యాలతో బాధపడే యువత, ఇలాంటి మానసిక అస్వస్ధత లేని పెద్దలతో పోలిస్తే అధికంగా గుండె జబ్బుల ముప్పు ఎదుర్కొంటారని పరిశోధకులు పేర్కొన్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేన్ జర్నల్లో అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. తీవ్ర మానసిక అనారోగ్యంతో బాధపడేవారు సాధారణ జనాభాతో పోలిస్తే పది నుంచి 20 ఏండ్లు ముందుగా మరణిస్తారని వెల్లడైందని అధ్యయన రచయిత, హెల్త్పార్టనర్స్ ఇనిస్టిట్యూట్, మినెసొటకు చెందిన రెబెక రాసమ్ పేర్కొన్నారు.
వీరు గుండెజబ్బుతో మరణిస్తారని వెల్లడించారు. మానసిక అనారోగ్యం ఉన్న వారితో పాటు సాధారణ జనాభాలోనూ బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్, బాడీ మాస్ ఇండెక్స్ వంటి ముప్పు కారకాలు గుండె జబ్బులకు దారితీసే అంశంపై తమ అధ్యయనం ప్రధానంగా దృష్టిసారించిందని తెలిపారు.