ఆయుర్వేదం ప్రకారం మనం వండుకునే, వడ్డించుకునే పాత్రలు వాత, పిత్త, కఫ దోషాలను ప్రభావితం చేస్తాయి. మన శరీరాన్ని సవ్యంగా ఉంచడంలో ఈ త్రిదోషాలది కీలకపాత్ర. రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ వివిధ లోహాలు సహకరిస్తాయి.
వెండి పాత్రలు సూక్ష్మక్రిములకు వ్యతిరేకంగా పోరాడే యాంటీమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ కారణంగానే చిన్నపిల్లలకు వెండి చెంచాలతో, గిన్నెల్ల్లో తినిపిస్తారు. అలా హానికరమైన బ్యాక్టీరియా నుంచి బిడ్డల్ని కాపాడుకుంటారు. వెండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫ్లూ, జలుబు లాంటివాటిని అడ్డుకుంటుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
సూక్ష్మక్రిములను చంపేస్తుంది. బంగారు పళ్లాలు వాత, పిత్త, కఫ .. త్రిదోషాలను సమతుల్యం చేస్తాయని అంటారు. కంచు కూడా తక్కువేం కాదు. శ్వాసకోశ వ్యాధులతో పోరాడుతుంది. దీర్ఘకాలిక నొప్పులు లాంటి వాతరోగాలు, పార్కిన్సన్స్ మొదలైన రుగ్మతలను అడ్డుకుంటుంది.