న్యూఢిల్లీ : ప్రాణాంతక వ్యాధిగా పరిగణించే క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించి చికిత్స పొందకపోతే శరీరం నిర్వీర్యమై మరణానికి చేరువ చేస్తుంది. మెరుగైన జీవనశైలి పలు రకాల క్యాన్సర్ల నుంచి మనకు రక్షణ కవచంలా నిలుస్తుంది. జీవనశైలితో పాటు మంచి ఆరోగ్య అలవాట్లతో క్యాన్సర్ ముప్పును న సభ్యుల్లో క్యాన్సర్ సోకిన వారు ఈ మహమ్మారి బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలి. కొన్ని ఆహార పదార్ధాలను పక్కనపెట్టడం ద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఉప్పు తక్కువగా తీసుకోవడం ద్వారా ఓవైపు రక్తపోటును అదుపులో ఉంచడమే కాకుండా క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చు. ఉప్పు, ఉప్పుతో కూడిన పదార్ధాలు అధికంగా తీసుకోవడం పొత్తి కడుపు క్యాన్సర్కు దారితీయవచ్చని వరల్డ్ క్యాన్సర్ రీసెర్చి ఫండ్ స్పష్టం చేసింది.
క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కుటుంబ చరిత్ర కలిగిన వారు చీజ్బర్గర్స్కు దూరంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ జంక్ ఫుడ్లో వాడే బీఫ్, రెడ్మీట్తో కలోన్ క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని అధ్యయనాలు స్పష్టం చేశాయి. అందుకే రెడ్మీట్ను వారానికి కేవలం 500 గ్రాముల వరకే తీసుకోవాలని వరల్డ్ క్యాన్సర్ రీసెర్చి ఫండ్ పేర్కొంది. ప్రిజర్వేటివ్స్, అధిక సోడియం నిల్వలుండే ప్రాసెస్డ్ మీట్ క్యాన్సర్ ముప్పును పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్డ్ మీట్ అధికంగా తినడం ద్వారా కలోన్ క్యాన్సర్ నుంచి పలు క్యాన్సర్ల బారినపడే ముప్పు అధికమని స్పష్టం చేశారు. కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉన్న వారు ఎడమేమ్గా పిలిచే సోయా బీన్స్ రకానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఆహారంతో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు అధికమని స్పష్టం చేస్తున్నారు. ఈ దిశగా మరింత పరిశోధన జరగాల్సి ఉన్నా ఈ ఆహారాన్ని తప్పించడం మేలని చెబుతున్నారు. యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్స్ కలిగిన ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు తీసుకోవడం ఆరోగ్యానికి మేలే అయినా ఫ్రైడ్ ఫిష్ మాత్రం అనారోగ్యాన్ని ఆహ్వానిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ ఆరోగ్యకర ఆహారాన్ని డీప్ ఫ్రై చేస్తే ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. డీప్ ఫ్రై చేయడం ద్వారా ఫిష్లో సహజంగా ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గిపోయి, ట్రాన్స్ఫ్యాట్ లెవెల్స్ పెరిగి ప్రాంకియాటిక్, ఒవేరియన్, లివర్, కొలెరెక్టల్ వంటి పలు క్యాన్సర్ల బారినపడే ముప్పు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.