న్యూఢిల్లీ : పచ్చి కూరగాయలను ఉడికించకుండా, వండకుండా నేరుగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని కొందరు భావిస్తుంటారు. అయితే కూరగాయలను జ్యూస్ రూపంలో లేదా ఉడికించకుండా తీసుకుంటే వికారం, అలసట, డయేరియా, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు బాధిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కూరగాయలను ఉడికించి లేదా లైట్గా వండుకుని వాటిని రుచి కోసం స్పైసెస్ను యాడ్ చేసుకుని తినడం మేలని సూచిస్తున్నారు. వేడి ఆహారం ప్రేవులకు రక్తప్రసరణను సాఫీగా సాగేలా చూడటంతో పాటు జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. వండిన ఆహారం కడుపులోకి వెళ్లిన తర్వాత త్వరగా అరగడంతో పాటు శరీరం సరైన రీతిలో ఆహారాన్ని గ్రహిస్తుంది.
వెజిటబుల్ సూప్స్ తీసుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్ధ మెరుగవడంతో పాటు దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. వెజిటబుల్స్తో పాటు పాలకూర వంటి ఆకుకూరలను నిత్యం ఆహారంలో తీసుకోవాలి. వీటిలో ఉండే ఐరన్, పొటాషియం, విటమిన్స్, ఇతర మినరల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.