Wonder Drink : మనం రోజును ఎలా ప్రారంభించామనే దానిపై మిగిలిన రోజంతా మనం ఎంత ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండగలమనేది ఆధారపడి ఉంటుంది. ఈ నిబంధన అందరికీ వర్తించినా ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించే వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. రాత్రంతా విశ్రాంతి తీసుకున్న అనంతరం రోజంతా మన పనులు చేసుకునేందుకు మన శరీరానికి అత్యవసర విటమిన్లు, పోషకాలు అవసరం.
దీనికోసం ఉదయాన్నే నిర్ధిష్ట ఆహారాలు, పానీయాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ జాబితాలో ఉండాల్సిన అద్భుతమైన పానీయం ఎండు ద్రాక్ష నీరు. ఈ అద్భుత పానీయం పలు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజూ కిస్మిస్లు నానబెట్టిన నీరు తాగితే రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపవచ్చని అంటున్నారు.
ఎండు ద్రాక్ష నీరు తాగడం ద్వారా గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను నివారించవచ్చు. జీర్ణశక్తి సాఫీగా సాగేందుకు ఈ పానీయం ఉపకరిస్తుంది. చర్మ సంరక్షణకూ ఈ పానీయం పనిచేస్తుందని అంటున్నారు. విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉండటంతో ఎండు ద్రాక్ష నీరు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎండు ద్రాక్ష నీటితో ఆరోగ్య ప్రయోజనాలు పరిశీలిస్తే..
జీర్ణశక్తి మెరుగుదల
బరువు తగ్గడం
మధుమేహ నియంత్రణ
చర్మ ఆరోగ్యానికి మేలు
కొలెస్ట్రాల్కు చెక్
Read More :