కరోనా కట్టడికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే, టీకా సరఫరాలో ధనిక దేశాల ఏకపక్ష వైఖరి కారణంగా పేద దేశాల్లో ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. కొవిడ్-19 టీకాపై పేటెంట్ హక్కులు విధించడంవల్లే ఈ పరిస్థితులు దాపురించాయని, వాటిని మాఫీ చేయాలంటూ పెద్దఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
1950 దశకంలో ప్రపంచవ్యాప్తంగా పోలియో విలయం సృష్టించింది. లక్షలాది మంది చిన్నారులు పక్షవాతానికి గురవ్వడం లేదా చనిపోవడం జరిగింది. సుమారు 18 లక్షల మంది చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి 1955లో ‘జోనస్ సాల్క్’ అనే అమెరికన్ శాస్త్రవేత్త పోలియోకు వ్యాక్సిన్ను కనుగొన్నారు. అదే సమయంలో మరో ఒకటి, రెండు కంపెనీలు కూడా పోలియోకు టీకాలను అభివృద్ధి చేసి పేటెంట్లు పొందాయి.
అయితే, ప్రపంచ దేశాలకు పోలియో వ్యాక్సిన్ చేరాలన్న ఉద్దేశంతో సాల్క్.. తన వ్యాక్సిన్కు పేటెంట్ను తీసుకోలేదు. టీకా ఫార్ములాను ఉచితంగానే అన్ని దేశాలకు పంపించారు. దీంతో పేద, మధ్య తరగతి దేశాలు స్వంతగా పోలియో టీకాలను తయారుచేసుకోగలిగాయి. హెచ్ఐవీ/ఎయిడ్స్ విషయంలోనూ ఇదే జరిగింది. వైరస్పై పోరాడుతూ, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చే పలు హెచ్ఐవీ/ఎయిడ్స్కు సంబంధించిన ఔషధాలపై కూడా పేటెంట్లను ఎత్తివేశారు. అందుకే ఇప్పుడు కొవిడ్ వ్యాక్సిన్కు కూడా పేటెంట్ తీస్యెయ్యాలనే డిమాండ్ వస్తున్నది.
ఇవి కూడా చదవండి
vaccine registration నేటి నుంచే : 18 ఏళ్లు పైబడిన వారు ఇలా రిజిస్టర్ చేసుకోండి
కరోనా అలర్ట్.. వచ్చే మూడు, నాలుగు వారాలు కీలకం
ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కోవిడ్ చికిత్స..
ప్రాణం పోసిన దవాఖానలో.. మొక్కను నాటిన మహిళ