మధ్యాహ్నం కాసేపు కునుకుతీయడం చాలామందికి అలవాటు. దీని మంచిచెడుల చర్చ ఎలా ఉన్నా.. కూసింత పగటి నిద్ర ఆరోగ్యకరమే అంటున్నారు స్లీప్ స్పెషలిస్టులు. అందుకు కారణాలు అనేకం..
మధ్యాహ్నం వేళ ఓ ఇరవై నిమిషాల కునుకు సరిపోతుందని చెబుతున్నారు స్లీప్ స్పెషలిస్టులు. దీనివల్ల, మళ్లీ రాత్రి వరకూ గాఢనిద్రలోకి జారుకోకుండా ఉంటారు. అయితే ఆ ఇరవై నిమిషాల కునుకు సమయంలో.. సెల్ఫోన్ దూరం పెట్టాలి. వెలుతురు, శబ్దాలు లేనిచోట పడుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులకు
పని ఒత్తిడి పెరుగుతున్నది. దీన్ని తగ్గించేందుకు కార్పొరేట్ సంస్థలు సిబ్బందికి కాసేపు కునుకు తీసే అవకాశం కల్పిస్తున్నాయి. ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేస్తున్నాయి.