హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం కేవలం భవనాలను నిర్మించి చేతులు దులుపుకోవడం లేదు. అత్యాధునిక వసతులు సమకూర్చుతూ.. భారీస్థాయిలో సిబ్బందిని నియమించింది. దవాఖానలను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నది. దీంతో రాష్ట్రంలోని అన్నిస్థాయిల దవాఖానలు బలోపేతం అయ్యాయి. వైద్యసేవలు మెరుగుపడటంతో ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. అందుకు తాజా గణాంకాలే నిదర్శనం. 2021, 22 మధ్య పోల్చినప్పుడు రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఓపీ, ఐపీ, సర్జరీల సంఖ్య గణనీయంగా పెరగడమే ఓ సూచిక.