న్యూఢిల్లీ : మనం రోజూ తీసుకునే ఆహార పదార్ధాల్లో చక్కెర కంటే ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ ఆహారా పదార్ధాల్లోని హిడెన్ షుగర్తోనే ప్రాణాంతకమని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో చక్కెర అధికమైతే ఊబకాయం, మధుమేమం, హృద్రోగాలు, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి తీవ్ర అనారోగ్యాల బారినపడే ముప్పు అధికమని నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అధిక చక్కెరతో కూడిన ఆహార పదార్ధాలను అధికంగా తినడంతో పాటు పెద్దమొత్తంలో దాగిన చక్కెరలను (హిడెన్ షుగర్) కూడా వాడుతున్నారని పలు అధ్యయనాలు, పరిశోధనలు వెల్లడించాయి. అధిక చక్కెరను తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరమని ఆయా కంపెనీలు ప్రచారం చేస్తున్న ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్లో అధికమైన హిడెన్ షుగర్ను శరీరాల్లో నింపేస్తుడటం ప్రమాదకరమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శరీరంలో చక్కెర ఇన్సులిన్ పెరగడానికి దారితీయడంతో పాటు బరువు పెరగడం, కొవ్వు పేరుకుపోవడానికి దోహదపడుతుందని న్యూట్రిషనిస్ట్, విన్ ఎవిరిడే ఫౌండర్ విపుల్ సనధ్య చెప్పారు. పలు కంపెనీలు తమ ఉత్పత్తుల్లో షుగర్ కంటెంట్ను దాచేందుకు లేబుల్స్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, డెక్స్ట్రోజ్, మాల్టోడెక్స్ట్రిన్ వంటి పేర్లు పొందుపరుస్తున్నాయని ఇవన్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని సనధ్య పేర్కొన్నారు.
లేబుల్స్పై బ్రౌన్ షుగర్, కేన్ షుగర్, కాస్టర్ షుగర్, కార్న్ స్వీటెనర్, క్యాస్టర్ షుగర్, ఫ్రూట్ జ్యూస్ కాన్సన్ట్రేట్, మాల్టోజ్, పామ్ షుగర్, ఆర్గానిక్ రా షుగర్ వంటివి రాసి ఉంటే ఆయా ఆహార పదార్ధాలను అవాయిడ్ చేయాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.