వాషింగ్టన్ : కొవిడ్-19 వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో నెలకొన్న విముఖత మహమ్మారి అంతానికి పెను సవాల్గా మారిందని తాజా అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పరీక్షల్లో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని అనుకోని వివాదాల నేపథ్యంలో వ్యాక్సిన్ల పట్ల ప్రజల్లో అపోహలు నెలకొన్నాయని జర్నల్ సైన్స్ ఎడిటోరియల్లో పరిశోధకలు పేర్కొన్నారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పట్ల ప్రచారంలో ఉన్న వార్తలతో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా ప్రజల విముఖత కారణంగా వైరస్ ముప్పు పెరుగుతోందని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన డేవిడ్ బ్రొనియటోస్కి వంటి ప్రొఫెసర్లు ఈ సంపాదకీయంలో రాసుకొచ్చారు.
భద్రతా ఆందోళనలపై భయంతోనే వ్యాక్సిన్ను కొందరు వ్యతిరేకిస్తున్నారని అధ్యయనం పేర్కొంది. వీరి ఆందోళనలు, అపోహలను తొలగించేలా ప్రజారోగ్య అధికారులు సరైన దిశగా చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమని తెలిపింది. వ్యాక్సిన్ పట్ల విముఖత చూపుతున్న వారు దీనిపై సోషల్ మీడియా, ఇంటర్నెట్లో తప్పుడు సమాచారం చేరవేయవచ్చని అథ్యయన రచయితలు ఆందోళన వ్యక్తం చేశారు.