Heart Attack | ఒకప్పుడు గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల గురించి వినడం, చూడడం చాలా అరుదుగా ఉండేది. కానీ ఇటీవల రోజూ వింటూనే ఉన్నాం. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నతనంలోనే హార్ట్ఎటాక్ సంభవించి ఎందరి ప్రాణాలో హరీ అంటున్నాయి. ఎవరికైనా గుండెపోటు వస్తే అత్యవసర సమయంలో వెంటనే చికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టేందుకు వైద్య శాఖ సిద్ధమైంది. వెంటనే స్పందించి దవాఖానకు తీసుకెళ్తే ఇచ్చేందుకుగానూ గద్వాల ప్రభుత్వ దవాఖానలో వైద్యులు టెనెక్టెప్లాస్ ఇంజక్షన్ను అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు ఎనిమిది మంది టీకా తీసుకున్నారు. ఆపత్కాలంలో ఎవరైనా దవాఖానకు వస్తే వారి ప్రాణాలు కాపాడేందుకు ఇంజక్షన్లు సిద్ధంగా ఉన్నాయని సూపరింటెండెంట్ కిశోర్ తెలిపారు.
గద్వాలటౌన్, మార్చి 10 : గుండెపోటు మ రణాలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. వయస్సుతో సంబంధం లేకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో ఒక పనిచేస్తూనే కుప్పకూలుతున్న ఘటనలు చూస్తున్నాం. నడుస్తూ, వ్యాయామం చేస్తూ, డ్రైవింగ్ చేస్తూ, కూర్చున్నచోటే ఇలా తనువు చాలిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే, సరైన సమయంలో స్పందించి దవాఖానకు తీసుకెళ్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు. వెనువెంటనే చికిత్స అందిం చి ప్రాణాలు నిలబెట్టే వైద్య సదుపాయం జో గుళాంబ గద్వాల జిల్లా దవాఖానలో అందుబాటులో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రం గంలో ఎప్పటికప్పుడు పెనుమార్పులు తీసుకొస్తూ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నది. అందులో భాగంగా గుండె సం బంధిత వ్యాధులను నిర్ధారించడానికి అధునాతన టెక్నాలజీ ఉన్న ఈసీజీ, టెనెక్టెప్లాస్ ఇంజక్షన్ను అందుబాటులో ఉంచింది. దీంతోపా టు ఏఈడీ మిషన్లను ప్రతి ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపడుతున్నది. త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఇప్పటికే ప్రకటించారు.
హార్ట్ఎటాక్ను మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అని కూడా పిలుస్తారని వైద్యులు చెబుతున్నా రు. గుండెకు తగిన మోతాదులో రక్తం సరఫ రా కాకపోవడంతో హార్ట్ఎటాక్ వస్తుంది. గుం డెలో ఉండే సెల్స్, కండరాలు జీవించి ఉండాలంటే అవసరమైన ఆక్సిజన్ సరఫరా కావాలి. ఆక్సిజన్ సరైన మోతాదులో అందకపోతే వెం టనే చికిత్స నిర్వహించాలి. అలా కాని పక్షం లో ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం, ఆటోఇమ్యూన్ కండీషన్, తీవ్ర ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు, ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్ అవ్వడం వంటివి గుండెపోటుకు ప్రధాన కారణాలుగా చెప్పొ చ్చు. గుండెపోటు తీవ్రతను ముందే గుర్తించి చికిత్స అందిస్తే వ్యక్తిని కాపాడుకోవచ్చని వై ద్యులు అంటున్నారు.
జోగుళాంబ గద్వాల ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన ఈసీజీ ద్వారా ప్రతి నెలా 50 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు వెయ్యి మందికి పైగా టెస్టులు చేశారు. వారిలో గుండెపోటు నిర్ధారణ అయిన వారికి అవసరమైన ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఆ తరువాత మెరుగైన చికిత్స నిమిత్తం ఇతర ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు.
జిల్లా దవాఖానకు వచ్చే రోగులకు మెరుగై న వైద్యాన్ని అందిస్తున్నారు. కార్పొరేట్ దవాఖానల్లో ఉండే టెనెక్టెప్లాస్ ఇంజక్షన్ను ఇక్కడ అందుబాటులో ఉంచారు. మార్కెట్లో ఈ ఇంజక్షన్ రూ. 25వేల నుంచి రూ.30 వేలకు వరకు ఉంటుంది. వ్యాధి తీవ్రతను బట్టి పూర్తి అనుభవం ఉన్న డాక్టర్ సమక్షంలోనే రోగులకు ఇంజక్షన్ ఇస్తున్నారు. ఈ ఇంజక్షన్ ఇచ్చిన 12 గంటల్లోగా మెరుగైన చికిత్స తీసుకోవాల్సి ఉం టుంది. ఇలా ఇప్పటివరకు ఎనిమి ది మందికి ఇంజక్షన్ ఇచ్చారు. వా రంతా మెరుగైన చికిత్స చే యించుకొని ఆరోగ్యం గా ఉన్నట్లు వైద్యు లు తెలిపా రు.
ప్రభుత్వ దవాఖానల్లో సరిగ్గా వైద్యం అందదు అనే అపోహను వీడాలి. కార్పొరేట్కు దీటుగా వైద్య సదుపాయాలు ఉన్నా యి. గుండె వ్యాధికి కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నాం. ఇందుకు ప్రత్యే క వైద్య బృందం కూడా ఉన్నది. టెనెక్టెప్లాస్ ఇంజక్షన్ ద్వారా ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రాణాలను కాపాడగలిగాం. ప్రజలందరూ ప్రభుత్వ దవాఖానలను సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ కిశోర్, సూపరింటెండెంట్, గద్వాల జిల్లా దవాఖాన
గద్వాల జిల్లా దవాఖానలో గుండెపోటుకు సంబంధించిన వైద్యం అందుబాటులో ఉన్నది. హార్ట్ఎటాక్ తీవ్రతను బట్టి చికిత్స అందిస్తాం. ప్రమాద స్థాయిలో ఉంటే వెంటనే టెనెక్టెప్లాస్ ఇంజక్షన్ ఇస్తాం. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నాం. ఇలా ఇప్పటివరకు 8 మందికి ఇంజక్షన్ ఇచ్చాం. వారందరూ ఆరోగ్యంగా ఉన్నారు.
– డాక్టర్ వంశీ, ఫిజీషియన్