ఓ మోస్తరు జ్వరం వస్తే భయపడాల్సిన అవసరం లేదట. వెంటనే డాక్టర్ను కలవడమో, మందులు మింగడమో చేయకూడదని యూనివర్సిటీ ఆఫ్ ఆల్బర్టా పరిశోధన సూచిస్తున్నది. స్వల్ప జ్వరం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్కు వ్యతిరేకంగా రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంతేకాదు, ఆ రక్షణ వ్యవస్థను తన నియంత్రణలో ఉంచుకుంటుంది.
చేపల మీద జరిగిన ఈ అధ్యయనం ‘ఈ-లైఫ్’ అనే జర్నల్లో ప్రచురితమైంది. చేపలు ఏడు రోజుల్లో ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడేందుకు మితమైన జ్వరం దోహదపడిందట. అంతేకాదు ఇన్ఫ్లమేషన్ తగ్గిపోవడానికి, గాయపడిన కండరాల మరమ్మతుకు కూడా జ్వరం సహకరిస్తుందట. కాబట్టి, ఓ మోస్తరు జ్వరం వచ్చినప్పుడు ఆందోళన చెందకూడదు. అంతా మంచే జరుగుతుంది అనుకోవాలి.