న్యూఢిల్లీ : ఆరోగ్యానికీ, అందం ఇనుమడించేందుకు పండ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు. పలు అనారోగ్యాలను దరిచేరకుండా తాజా పండ్లు మనల్ని కాపాడుతుంటాయి. తరచూ తినే పండ్లతో పాటు అరుదుగా లభించే పండ్లలోనూ పోషకాలు మెండుగా ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
విదేశాల్లో దొరికే పండ్లు సైతం ఇప్పుడు భారత్లోనూ అందుబాటులోకి వచ్చాయి. టిక్టాక్, ఇన్స్టాగ్రాంల ద్వారా పలు రకాల పండ్లు పరిచయమవుతున్నాయి. ఈ పండ్లు రుచితో పాటు ఆరోగ్యాన్ని వన్నె తరగని మేని సౌందర్యాన్ని అందిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
గోల్డెన్బెర్రీ : పెరువియన్ గ్రౌండ్చెర్రీగానూ పేరొందిన గోల్డెన్బెర్రీలో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. ఈ పండు శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్ : పితాయగా కూడా పిలిచే ఈ డ్రాగన్ ఫ్రూట్లో ప్రొటీన్, క్యాల్షియం అధికంగా ఉండటంతో ఎముకలు, కండరాల బలోపేతానికి ఉపయోగకరం.
హార్నడ్ మెలన్ : కివానోగా వ్యవహరించే హార్న్డ్ మెలన్ పండులో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన కీలక పోషకాలు హార్న్డ్ మెలన్తో లభిస్తాయి.
స్టార్ఫ్రూట్ : నక్షత్ర ఫలంగా పిలిచే స్టార్ఫ్రూట్లో తగినంత ఫైబర్, విటమిన్ సీ ఉండటంతో మలబద్ధకాన్ని నివారించడమే కాకుండా ఇమ్యూనిటీ పెరుగుతుంది.
ప్యాషన్ ఫ్రూట్ : ప్యాషన్ ఫ్రూట్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఈ పండులో విటమిన్ సీ, ఐరన్ ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరగడంతో పాటు రక్తహీనతను నివారిస్తుంది.