కరోనా వైరస్ మొదట దాడిచేసేది, సంతతి పెంచుకునేది ఊపిరితిత్తుల్లోనే. దీంతో ఆక్సిజన్ స్థాయిలు తగ్గితే వెంటనే సీటీ స్కాన్చేయించుకోని, ఇన్ఫెక్షన్ తీవ్రతను గుర్తించి తక్షణమే దవాఖానలో చేరితే ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ఆలస్యమైతే వైరస్ఊపిరితిత్తులను పిప్పిచేస్తూ ఊపిరిని ఆపేస్తున్నది. వైరస్ సోకిన వెంటనే ఊపిరితిత్తులను కాపాడుకోవడానికి చికిత్స తీసుకోవాలనిప్రముఖ ఛాతి వైద్యనిపుణుడు, ప్రభుత్వ ఛాతి దవాఖాన మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ శుభాకర్ తెలిపారు. కరోనా వచ్చిన వారిలోవైరస్ ప్రభావం శరీరంలో దీర్ఘకాలం ఉంటున్నదని, ఎక్కువ మందిలో ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతున్నదని చెప్పారు. ఇది కొన్నిసందర్భాల్లో ప్రమాదకరంగా పరిణమిస్తుందని అన్నారు. పల్మనరీ ఫైబ్రోసిస్ ఎక్కువమందిలో వస్తున్నదని, దాని ప్రభాభం, జాగ్రత్తలను‘నమస్తే తెలంగాణ’తో వెల్లడించారు.
-హైదరాబాద్ నమస్తే తెలంగాణ
కరోనా వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు ఆక్సిజన్ స్థాయిని గమనిస్తూ ఉండాలి. దగ్గు, దమ్ము, ఆయాసం ఉంటే జాగ్రత్తపడాలి. బరువుతగ్గటం, పొడిదగ్గు, ఒళ్లు నొప్పులు వంటివి ఫైబ్రోసిస్ లక్షణాలే. ఫైబ్రోసిస్ ఉంటే ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. కరోనా వచ్చినచాలామందిలో వైరస్ లక్షణాలు బయటపడ్డ 5 రోజులకు ఆక్సిజన్స్థాయి తగ్గడాన్ని గమనిస్తున్నాం. ఆక్సిజన్ 95 శాతం కన్నాతక్కువుంటే ఆలస్యం చేయవద్దు. దవాఖానలో చూపించుకోవాలి. ఆక్సిజన్ స్థాయిలో మార్పులుంటే హెచ్ఆర్ సీటీ స్కాన్ చేయించాలి.
ఇప్పటివరకు వస్తున్న కరోనా కేసులు, పల్మనరీ ఫైబ్రోసిస్ కేసులను గమనిస్తే మధ్యవయస్కులు, వృద్ధుల్లో ఈ సమస్య వస్తున్నట్టుతెలుస్తున్నది. పొగతాగేవారికి ఫైబ్రోసిస్ ముప్పు ఎక్కువ. గనుల్లో, నిర్మాణ రంగంలో ప్రత్యక్షంగా పనిచేసేవారికి, వాయుకాలుష్యం ఉన్నప్రాంతాల్లో నివసించేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తున్నది. టీబీ రోగుల్లో కూడా ఇవే కారణాలతో పల్మనరీ ఫైబ్రోసిస్ వచ్చే ప్రమాదంఉన్నది. జంతు, పక్షుల విసర్జితాల వల్ల అలర్జీలున్నవారిలో కూడా వచ్చే ప్రమాదం ఉన్నది. మహిళలకన్నా పురుషుల్లోనే ఫైబ్రోసిస్వచ్చే అవకాశాలు ఎక్కువ.
పల్మనరీ ఫైబ్రోసిస్కు గురైనవారి కరోనారోగుల రికవరీలో వ్యత్యాసాలుంటాయి. ఇమ్యూనిటీ, ఊపిరితిత్తుల పనితీరును బట్టి ఎంతకాలంలోపేషెంట్లు రికవరీ అవుతారన్నది ఉంటుంది. ఫైబ్రోసిస్ ఊపిరితిత్తుల్లో ఎంతవరకు వ్యాపించిందనే దాన్ని ఆధారంగా రికవరీ చెప్పగలం.కొన్ని సందర్భాల్లో 2-3 నెలలపాటు కూడా రోగులు కృత్రిమ శ్వాసపై ఆధారపడి ఉండాల్సి వస్తుంది. ఫైబ్రోసిస్ తీవ్రతను బట్టిదవాఖానలో ఉంచి చికిత్స చేయటమా? ఇంటివద్ద ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ద్వారా చికిత్స ఇవ్వటమా అన్నది వైద్యులు నిర్ణయిస్తారు.కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తులను పూర్తిగా మార్చాల్సి కూడా రావచ్చు.
పల్మనరీ ఫైబ్రోసిస్కు ఇప్పటివరకు నేరుగా మందులేమీ లేవు. కరోనా వంటిదే ఇది కూడా. దీని స్థాయిని అంచనా వేస్తూ స్టెరాయిడ్లనుఇస్తుంటాం. రెండురకాల స్టెరాయిడ్లను ఎక్కువగా వాడుతుంటాం. వీటిని కూడా మోతాదునుబట్టి వాడాలి. ఫైబ్రోసిస్ ఉన్నవారు శరీరంలోఆక్సిజన్ స్థాయిని పెంచే వ్యాయామాలు, యోగా చేయాలి.