ఇయర్ఫోన్స్ కారణంగా నేటితరం పిల్లల్లో.. ప్రతి ఐదుగురిలో ఒకరికి వినికిడి సమస్య వస్తున్నట్టు నిపుణులు గుర్తించారు. రోజు మొత్తంలో గంటపాటు మాత్రమే.. అదీ 60 శాతం వాల్యూమ్తో వింటే ఎలాంటి ఇబ్బందీ ఉండదని సూచిస్తున్నారు. పరిధి మించితే ఆ ధ్వని కారణంగా చెవిపోటు వస్తుంది. ఆ శబ్ద కంపనాలు కాక్లియాకు చేరుతాయి. ఫలితంగా వినికిడి లోపం ఏర్పడుతుంది. ఇయర్ఫోన్స్ను చెవి లోపలికి బలంగా నెట్టినప్పడు గుమిలి ఇంకొంత లోపలికి చొచ్చుకుపోయి ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. కొన్నిసార్లు నొప్పి దవడ, తలభాగాలకూ వ్యాపిస్తుంది. హెడ్ఫోన్స్ ద్వారా ఉత్పన్నమయ్యే విద్యుత్ అయస్కాంత తరంగాలు మెదడుకు సమస్యలను కలిగిస్తాయి. మెదడుకు సంకేతాలను తీసుకెళ్లే నరాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.