న్యూఢిల్లీ : శీతాకాలంలో కాలుష్యానికి పొగమంచు తోడవడంతో వాయు నాణ్యత (ఏక్యూఐ) దారుణంగా పడిపోతూ ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. దేశ రాజధానిలో అయితే ఏక్యూఐ ఆందోళనకరంగా పతనమవడంతో పరిస్ధితి ప్రమాదకరంగా మారింది.
వణికించే చలి, పొగమంచు, కాలుష్యం కలిసి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని పల్మనాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో ఉదయాన్నే వ్యాయామం కోసం రోడ్లపై వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్కు వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇండోర్లోనే వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలని బయట ప్రదేశాల్లో వ్యాయామం చేయాలంటే తొమ్మిది గంటల తర్వాతనే బయటకు రావాలని సూచిస్తున్నారు. శీతాకాలంలో బయటకు వచ్చే సమయాల్లో విధిగా ఎన్95 మాస్క్ను ధరించాలని నిపుణులు చెబుతున్నారు.