హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతున్నది. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులోకి 14,314 క్యూసెక్యుల నీరు వస్తుండగా, 28,252 క్యూసెక్యుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 823.50 అడుగుల నీటిమట్టం ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు. అయితే ప్రస్తుతం 43.54 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.